మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... క్యాథరిన్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఊర్వసి రేటేల ఈ మూవీ లో బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ లో చిరంజీవి మరియు ఊర్వశి కలిసి స్టెప్ లు వేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మాస్ మహారాజా రవితేజమూవీ లో అతి ముఖ్యమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అద్భుతమైన శుభవార్త వచ్చింది. ఈ సినిమా యొక్క టికెట్ ధరలను 25 రూపాయలు పెంచుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరల పెంపును ఈ సినిమా విడుదల అయిన తొలి 10 రోజులకు మాత్రమే వర్తిస్తుంది అని ఉత్తర్వు లలో పేర్కొంది. ఈ 10 రోజుల టికెట్ ధరల పెంపు వాల్తేరు వీరయ్య మూవీ కి చాలా వరకు కలిసివచ్చే అంశం అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: