నందమూరి బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన వీర సింహా రెడ్డి అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీ రోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో హనీ రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే పరవాలేదు అనే రేంజ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ... అలాగే ఈ మూవీ ని కొన్ని వారాల ధియేటర్ రన్ తర్వాత డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: