అప్పటివరకు టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హిట్ సాధించడంతో ఇక అన్ని భాషలకు సంబంధించిన నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టారు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే ఇక బాహుబలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత రెండు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు.


 భారీ యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన సాహూ సినిమాతో ప్రేక్షకులకు ముందు వస్తే ఆ సినిమా సో సో గానే ఆడింది. ఇక ఆ తర్వాత వండర్ఫుల్ లవ్ స్టోరీ అంటూ రాధేశ్యమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక ఆ సినిమా పెద్దగా హిట్టు కొట్టలేకపోయింది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఆదిపురుష్ అనే మాసీవ్ ప్రాజెక్టు ఒకటి ఉంది అని చెప్పాలి.  ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో సినిమాను లాక్ చేసినట్లు గాసిప్స్ మొదలయ్యాయి. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రానికి నిర్మాతలుగా ఉన్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఒక టాక్ షోకి రాగా ఇక్కడ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.


 బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తో ఒక సినిమా చేయబోతున్నాము అంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లోకి కూడా ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపిస్తాడని చెప్పకనే చెప్పారు మైత్రి మూవీకి మేకర్స్ అధినేతలు. అయితే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదికి వస్తుంది అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాలి. కాగా  సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన  భారీ యాక్షన్ మూవీ పఠాన్ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఇక ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: