తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ సీనియర్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా , శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందించగా , మాస్ మహారాజ రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి ఏకంగా 200 కోట్ల కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ప్రస్తుతం చిరంజీవి "భోళా శంకర్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత చిరంజీవి తన తదుపరి మూవీ ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... పూరి జగన్నాథ్ ప్రస్తుతం చిరంజీవి తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ... అందులో భాగంగా చిరంజీవి కి ఈ మధ్యన పూరి ఒక కథను కూడా వినిపించినట్లు ... ఆ కథ బాగా నచ్చిన చిరంజీవి వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: