బాలీవుడ్లో మరియు భోజ్పురి సినిమాల్లో నిర్మాతగా నటుడిగా రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కమల్ రషీద్ ఖాన్ కె ఆర్ కె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తరచూ ఈయన సెలబ్రిటీల మీద ఏవో ఒక నిందలు వేస్తూ విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఈయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు .అయినప్పటికీ ఈయనకి కొంచెం కూడా భయం లేదు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు ఈయన. అంతేకాదు తన సినీ క్రిటిక్ అని కూడా తనకు తానే ఫీల్ అవుతూ పొంగిపోతూ ఉంటాడు. 

వివాదాలే కాకుండా ఏవైనా కొత్త సినిమాలు వస్తే వాటిపై కూడా రివ్యూ ఇస్తూ హైలెట్ అవుతూ ఉంటాడు. అయితే తాజాగా బాలీవుడ్లో ప్రస్తుతం కొత్త రకం ఫ్రెండ్ నడుస్తుంది అంటూ చెప్పి ఒకసారి గా అందరికీ షాక్ ఇచ్చాడు రషీద్ ఖాన్. ఇక ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది.. ఫస్ట్ ప్రెగ్నెన్సీ దాని తర్వాత పెళ్లి అని రెండు ఇప్పుడు బాలీవుడ్లో నడుస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా పెళ్లి చేసుకున్న కొత్తజంట కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతోంది అని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని బయట పెడుతూ కొన్ని సంచలన కామెంట్లను చేశారు కె ఆర్ కె.

ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఆ కొత్తజంట ఎవరు అనేది చెప్పలేదు. కాకపోతే ఆయన కొత్తజంట అని అనడంతో అందరూ కియార అద్వానీ మరియు సిద్ధార్థ మల్హోత్ర అనే భావిస్తున్నారు. ఎందుకు అంటే తాజాగా పెళ్లి చేసుకున్న కొత్తజంట వీరే కాబట్టి .అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చాలామంది కియార అద్వానీ పెళ్ళికి ముందే గర్భవత అంటూ సందేహంలో పడ్డారు. పెళ్లికి ముందే తల్లయింది కాబట్టి ఇంత తొందరగా పెళ్లి చేసుకుందా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే నిజంగా కె ఆర్ కె  సిద్ధార్థ మరియు  కియార ని ఉద్దేశించే చెప్పాడా లేక వేరే ఎవరి గురించి అయినా చెప్పాడా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: