ఈసారి బిగ్ బాస్ సరికొత్త సీజన్ ని చాలా రసవత్తరంగా నడిపించాలని ప్లాన్ చేస్తున్నారు బిగ్బాస్ టీం. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లును కూడా చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ ప్రయోగానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. తెలుగులో బిగ్ బాస్ షో కి ఎంతటి ప్రేక్షక ఆధారణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అలాంటి బిగ్ బాస్ షో ప్రతి సీజన్ కు రేటింగ్ పడిపోతూ ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు మేకర్స్. ఎన్టీఆర్ హోస్ట్గా చేసిన ఫస్ట్ సీజన్ మరియు నాగార్జున చేసిన రెండు సీజన్స్ మాత్రమే మంచి రేటింగ్స్ ను తీసుకురాగలిగాయ్. మిగిలిన సీజన్స్ సో సో గా ఉన్నప్పటికీ..

ఈసారి వచ్చిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ మాత్రమే చాలా బోర్ కొట్టింది అని చెప్పాలి. దీంతో నాగార్జున కూడా ఎప్పుడో బిగ్ బాస్ కొత్త సీజన్ కి పోస్ట్ గా చేయడం లేదని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కొత్త సీజన్ కి హోస్ట్లుగా రానా బాలకృష్ణ మరియు విజయ్ దేవరకొండ ఇలాంటి పేర్లు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కొత్త సీజన్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను ఎలాగైనా హిట్ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు టీం. ఇందులో భాగంగానే యాంకర్ రష్మిని కూడా బిగ్ బాస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట బిగ్బాస్ టీం.

దాంతోపాటు విడాకులు తీసుకున్న ఒక సెలబ్రిటీ జంటను కూడా ఈ హౌస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. అది టాలీవుడ్ స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకున్న నోయల్ మరియు ఆయన ఒకప్పటి భార్య ఎస్తర్ నుఈ షో కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు బిగ్బాస్ టీం. ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహం చేసుకున్న కొన్నాళ్లకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలను కూడా చేసుకున్నారు. ఇక అలా వీరిద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్లాన్లు ఉన్నారట. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలను చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో బాగా పాపులర్ అయిన ఈ జంటని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తే బిగ్ బాస్ టి ఆర్ పి రేటింగ్ బాగా వస్తుందన్న ఆలోచనతో బిగ్ బాస్ టీం ఇలాంటి ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: