సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుందని సినీ పండితులు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది హీరోయిన్లు దశాబ్ద కాలం దాటిపోతున్న ఇంకా స్టార్ హీరోయిన్ గానే హవా నడిపిస్తూ ఉన్నారు. అయితే మరి కొంత మంది ఇక సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస అవకాశాలతో దూసుకుపోతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పారితోషికం గురించి తెలుసుకునేందుకు సినీ ప్రేక్షకులు ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ప్రస్తుతం ఇక సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ వివరాలు చూసుకుంటే..


 రమ్యకృష్ణ : ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రమ్యకృష్ణ ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రీతిలో హవా నడిపిస్తూ ఉంది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే రమ్యకృష్ణ ఒక్క రోజుకి రెండు లక్షల పారితోషికం తీసుకుంటుందట.

 నదియా  : ఒకప్పుడు హీరోయిన్గా తన అందం అభినయంతో ఆకట్టుకున్న నదియా ఇక ఇప్పుడు మోడ్రన్ తల్లిగా అత్తగా కూడా ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఎన్నో రోజుల నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో లీడ్ లో కొనసాగుతుంది. ఇక ఈమెకు పారితోషకం కూడా రోజుకి రెండు లక్షల వరకు ఉంటుందట.

 జయసుధ : ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా చిత్ర సీమను ఏలిన నటమణుల్లో జయసుధ కూడా ఒకరు. సహజ నటిగా ఈమె గుర్తింపు సంపాదించుకుంది. అయితే జయసుధ 12 రోజుల షూటింగ్ కోసం దాదాపు 20 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ఉంటారట. అంటే ఒక్క రోజుకు రెండు లక్షల వరకు పారితోషకం తీసుకుంటారని తెలుస్తుంది. అయితే వీరితోపాటు మరికొంతమంది సీనియర్ నటమణులు ఒక్కరోజుకు 50 వేల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: