అనుష్క ఒకప్పుడు వరుస గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈమె బాహుబలి సిరీస్ తో పాన్ వరల్డ్ వైడ్ గా అయితే పాపులర్ అయ్యింది.

సినిమా తో ఈమె క్రేజ్ భారీగా అయితే పెరిగింది అనే చెప్పాలి. అయితే ఈమె లాస్ట్ గా తెలుగులో నిశ్శబ్దం సినిమాని చేసింది.

సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుందట.అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''మిసెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి''.ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండ గా రారా కృష్ణయ్య సినిమా తో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని సమాచారం..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.. సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈమె సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇక ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కూడా వారు స్టార్ట్ చేసారు.. తాజాగా టీజర్ రిలీజ్ చేయ గా మంచి రెస్పాన్స్ కూడా లభించింది.. ఇదే టీజర్ పై తాజాగా రామ్ చరణ్  మంచి రెస్పాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. టీజర్ నాకు బాగా నచ్చింది అని ఎంతో రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది అని అంటూ చిత్ర యూనిట్ కు తన తరపున గుడ్ లక్ అని తెలిపారు. మరి ఈ పోస్ట్ పై తాజా గా అనుష్క కూడా స్పందించింది.. ''సో స్వీట్ ఆఫ్ యు చరణ్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను నీ భార్య ఉపాసన తో కలిసి తప్పకుండ చూడాలి అంటూ థాంక్స్ చెప్పింది.. దీం తో ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి: