వాల్మీకి రచించిన రామాయణం ఆధారం గా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''ఆదిపురుష్''. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ కళ్ళు కాయలు కాచే లా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను రాముడి పాత్ర లో వెండితెర మీద చూస్తామా అని ఎదురు చూడని అభిమాని అయితే లేడు...

తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తం గా నిర్మించారని తెలుస్తుంది... ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా లో కృతి సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే .. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి గా నటిస్తుండ గా.. సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

వచ్చే నెల గ్రాండ్ విడుదల కానున్న నేపథ్యం లో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్నారటా.ఇదిలా ఉండగా ఇప్పటికే ఆంధ్రాలో తిరుపతి వేదిక గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఈవెంట్ లో అదిరిపోయే సర్ప్రైజ్ లను మేకర్స్ ప్లాన్ చేసినట్టు కూడా ఇప్పుడు గాసిప్ వస్తున్నాయి.. నెవర్ బిఫోర్ అనేలా ప్లానింగ్ రెడీ చేశారని తెలుస్తుంది.. మాములుగా అందరు చేస్తున్న రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నం గా ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్ ప్లానింగ్స్ ను ఏర్పాటు చేసారని.. ఈ ఈవెంట్ కు వెళ్లిన వారికి మాత్రమే కాకుండా ఆన్లైన్ లో చూసే వారికీ కూడా థ్రిల్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం... 2 లక్షల మంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగనుందటా... మరి ఈ ఈవెంట్ లో ఎలాంటి సర్ప్రైస్ లు ఇవ్వబోతున్నారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: