తెలుగు బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 ఎంతో అద్భుతంగా కొనసాగింది. ఇందులో పాల్గొన్న కంటెస్టంట్లు కూడా తెగ సందడి చేయడమే కాదు తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు. అయితే చివరి దాకా బిగ్ బాస్ లో అన్ని పరీక్షలు నెగ్గుతూ..నెటిజన్ల మనసు దోచి కంటిన్యూ అయిన వారిలో శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, అర్చన, నవదీప్ లు కొనసాగారు.
తాజాగా అర్చన ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది. ఆయన ఎవరో కాదు ఎన్నో డిబెట్లలో పాల్గొని అందరికి సుపరిచితమైన హేతువాది బాబు గోగినేని. గత కొన్నిరోజుల నుంచి బాబు గోగినేని బిగ్ బాస్ హౌజ్ లో ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తుందని అన్నారు.
బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అందరూ సమానమే అని..కొన్ని టాస్క్ లు ఆయన చేయనని చెప్పడం షాకింగ్ గా ఉందని అన్నారు. హోస్ట్ గా నాని పర్ఫామెన్స్ బాగుందని చెప్పింది. అయితే, తారక్ గొప్పగా చేశాడని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఇష్టమైనవారు ఉన్నారని.... వాళ్లను సేవ్ చేయడానికి చివర్లో వారి పేర్లను బయటపెడతానని చెప్పింది.