సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా ప్రతి విషయంలో మీడియాలో వస్తున్న నెగటివ్ రూమర్స్ కు మహేష్ చాలా అప్సెస్ట్ అవుతున్నాడని తెలుస్తుంది.


మొన్నటిదాకా సినిమా రిలీజ్ మే అనగానే మహేష్ కు ఆ నెల కలిసి రాదని వార్తలు రాయగా ఇప్పుడు సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ చోటి చోటి బాతె సాంగ్ పై కూడా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ అసలు ఏమాత్రం కొత్తదనం లేకుండా ఈ పాట కంపోజ్ చేశాడని విమర్శలు చేస్తున్నారు.


అయితే ఈ విషయం మహేష్ దాకా వెళ్లడంతో మహర్షి సినిమాపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ మహేష్ కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతుందట. అంతేకాదు ఈ టాక్ సినిమా బిజినెస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా రైట్స్ గురించి నిర్మాతలకు, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కు బేరం తెగట్లేదు.


ఇప్పుడు సాంగ్ గురించి కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో మహేష్ ఇంకాస్త జాగ్రత్త పడాలని సూచించాడట. ఓ పక్క దిల్ రాజు సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు రియలైజ్ అవుతాడని అన్నాడు. కాని సినిమా పాటకు వచ్చిన రెస్పాన్స్ అంత గొప్పగా లేదు. మరి మహేష్ మహర్షి ఎలా ఉంటుంది ఏం చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: