ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరి జగన్నాథ్ మస్త్ ఖుషీ గా ఉన్నాడు. ఇన్నాళ్లూ ఫ్లాపుల్లో ఉన్న పూరికి ఉపశమనం దొరికినట్టయింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా దాదాపు 42 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలందరినీ టచ్ చేసిన పూరికి ఓ డ్రీమ్ ఉంది. అదే.. మెగాస్టార్ ను డైరెక్ట్ చేయడం.

 

 

చిరంజీవితో సినిమా చేయాలని పూరి ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. ఎన్టీఆర్ తో చేసిన ఆంధ్రావాలా కథ మొదట చిరంజీవికే వినిపించాడు. అయితే చిరంజీవికి ఆ కథ నచ్చకపోవడంతో వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. చిరంజీవి 150వ సినిమా చేయాలని ఆటోజానీ కథ వినిపించాడు. ఫస్ట్ ఆఫ్ నచ్చిన చిరంజీవికి సెకండాఫ్ నచ్చలేదు. ఈలోపు చిరంజీవి వినాయక్ తో సినిమా చేసాడు. అయినా పూరి నిరాశ చెందలేదు. "చిరంజీవి గారితో 150 కాకపోతే 151 చేస్తా.. లేకపోతే 152 చేస్తా. మొత్తానికి చిరంజీవి గారితో సినిమా చేస్తా. చిరంజీవి తెరమీద ఎలా కనబడాలో ఆయనకంటే నాకే బాగా తెలుసు" అని ఆమధ్య ట్విట్టర్ లో రాసాడు. ఇప్పుడు మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది.

 

 

ఇస్మార్ట్ శంకర్ కోసం మీడియా ఇంటరాక్షన్స్ లో భాగంగా మాట్లాడుతూ "చిరంజీవి గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. నాకు అవకాశం వస్తే 5 నిమిషాల్లో కథ వినిపించేసి ఓకే చేయిస్తా" అన్నాడు. పూరి టేకింగ్ తెలిసిన చిరంజీవికి కథ నచ్చాలి అంతే. వీరిద్దరి కాంబో సెట్ అయితే అభిమానులకు పండగే.

మరింత సమాచారం తెలుసుకోండి: