ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. వచ్చిన ప్రతి సినిమా చేసేయడం కొంతమంది హీరోయిన్స్ అలవాటు అయితే తనకు వచ్చిన పాత్రల్లో పాత్ర స్వభావం అది సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉంటుంది అని లెక్క లేసుకుని చూసే టైపు హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. 


ఈ సెకండ్ కేటగిరి హీరోయిన్ అంటే అది సాయి పల్లవి లాంటి వారే అని చెప్పాలి. ఫిదా, ఎం.సి.ఏ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న సాయి పల్లవి ప్రస్తుత శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. అయితే ఇప్పటికే సాయి పల్లవి కోసం చాలా ఆఫర్లు వస్తున్నా వాటిని చేయనని చెప్పేసిందట ఈ ఫిదా బ్యూటీ.


ముఖ్యంగా తెలుగులో బడా నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ నుండి 3 సినిమా ఆఫర్లు వచ్చినా మూడింటిని సాయి పల్లవి చేయనని చెప్పేసిందట. గీతా ఆర్ట్స్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాలో హీరోయిన్ గా ముందు సాయి పల్లవిని అనుకున్నారట. సినిమాలో గ్లామర్ షోకే ఇష్టపడని సాయి పల్లవి హీరోతో లిప్ లాక్ అనడంతో సరీ అని చెప్పేసిందట. 


ఇక రీసెంట్ గా స్టార్ట్ అయిన అల్లు అర్జున్, త్రివిక్రం ల కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట సాయి పల్లవిని అనుకున్నారట. కాని ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకుందట. అయితే ఆ సినిమాలో తన పాత్ర నచ్చకనే సాయి పల్లవి ఆ మూవీ వదులుకుందని టాక్. ఇక ఇప్పుడు అదే బ్యానర్ లో వస్తున్న అఖిల్ సినిమా ఆఫర్ ను కాదనేసిందట సాయి పల్లవి. బొమ్మర్ల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ హీరోగా వస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకోగా.. సినిమాలో హీరోయిన్ పాత్ర అంత వెయిట్ లేదని ఆమె కాదన్నదట. ఇలా వచ్చిన ఆఫర్లను కాదనుకుంటూ పోతే సాయి పల్లవి ఫ్యూచర్ లో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని సిని విశ్లేషకులు అంటున్నారు.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: