సంక్రాంతి రేసుకు రాబోతున్న ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీల రిలీజ్ డేట్స్ మారే విషయం పై వస్తున్న వార్తలకు రేపు అధికారికంగా క్లారిటీ వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బన్నీలు ఇద్దరూ న్యూఇయర్ హాలిడే ట్రిప్ ఉన్న నేపధ్యంలో వేరువేరు దేశాలలో ఉన్న వీరిద్దరూ రేపు హైదరాబాద్ వస్తారని ఆతరువాత మాత్రమే ఫైనల్ నిర్ణయం ఉంటుంది అని అంటున్నారు.

వాస్తవానికి అల్లు అర్జున్ ఇలా ఎవరు ఊహించని విధంగా తన మూవీని ఈనెల 12న కాకుండా 10న విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఒకపార్టీలో జరిగిన సంఘటన అంటున్నారు. ఈమధ్య ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి ఇంటిలో జరిగిన పార్టీలో మహేష్ బన్నీ గురించి ‘అల వైకుంఠపురములో’ మూవీ గిరించి తక్కువ చేసి మాట్లాడాడు అని ఈవిషయాలు బన్నీ దృష్టి వరకు వెళ్ళడంతో సంక్రాంతి రేసులో ముందుగా వచ్చి మహేష్ కు ఊహించని షాక్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు అన్న గాసిప్పులు ఉన్నాయి.

అయితే ఇవన్నీ అవాస్తవాలు అనీ బన్నీ మహేష్ ల మధ్య మరింత చిచ్చు పెట్టడానికి కొందరు వ్యతిరేక శక్తులు ప్రచారంలోకి తీసుకు వస్తున్న రూమర్స్ అంటూ ఆమాటలను ఖండిస్తున్నారు. జరుగుతున్న ఈపరిణామాలను మరికొందరు అల్లు అరవింద్ దృష్టి వరకు తీసుకు వెళితే ఆయన మౌనం వహిస్తూ బన్నీ ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత చెపుతాను అంటూ ప్రస్తుతానికి సమాధానం దాట వేస్తున్నట్లు టాక్. 

అల్లు అర్జున రికార్డుల కోసం ధియేటర్ల సంఖ్య కోసం జనవరి 10 పై మోజు పడుతున్నా ఆ డేట్ కు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. జనవరి 10 డేట్ వినగానే త్రివిక్రమ్ కు ‘అజ్ఞాతవాసి’ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆడేట్ వద్దు అంటూ ఇప్పటికే అరవింద్ కు అదేవిధంగా బన్నీకి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు రెండు భారీ సినిమాలకు ఇష్టం వచ్చినట్లు డేట్స్ మార్చడం అంత సులువైనది కాదనీ ఇప్పటికే ఈరెండు సినిమాలకు సంబంధించిన ధియేటర్ల ఎగ్రిమెంట్ లు పూర్తి అయిన పరిస్థితులలో వాటిని మళ్ళీ తిరిగి రాయడం అంత సులువైన పని కాదనీ అలాంటి పరిస్థితులే ఎదురైతే బన్నీ సినిమాకు మేజర్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ తాను ‘అల వైకుంఠపురములో’ డిస్ట్రిబ్యూషన్ నుండి తప్పుకుంటాను అంటూ లీకులు ఇస్తున్న పరిస్థితులలో ఈరగడకు సంబంధించిన అసలు విషయాలు రేపు మాత్రమే తెలుస్తుంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: