టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంటర్ అయిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న, ఫస్ట్ సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో పాటు ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం రూపంలో మరొక సూపర్ హిట్ ని అందుకుంది. ఇక ఇటీవల ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు లో నటించి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నితిన్ సరసన భీష్మ తో పాటు బన్నీ, సుకుమార్ ల మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే వీటి తరువాత ఆమెకు వరుసగా పలు క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. 

 

అతి త్వరలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో మొదలెట్టనున్న ఎన్టీఆర్, ఆ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారట. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ చాలావరకు పూర్తి అయిందని, ఫైనల్ స్టేజెస్ లో ఉన్న స్క్రిప్ట్ అతి త్వరలో పూర్తి కాగానే, సెట్స్ మీదకు తీసుకెళ్లడం జరుగుతుందని అంటున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను తీసుకునేందుకు త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు.

 

అయితే త్రివిక్రమ్ తన సినిమాకు రష్మిక ను ఎంపిక చేసిన మాట నిజమే అని, 
అయితే అది ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసం కాదని, దాని తరువాత ఆయన పవన్ తో చేయబోయే సినిమా కోసం అని అంటున్నారు. కాగా ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసం హీరోయిన్ ని అతి త్వరలో ప్రకటిస్తారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, వీటిలో ఏ ఒక్కటి నిజమై, వీరిలో ఏ ఒక్క హీరోతో అయినా రష్మిక జోడి కట్టినట్లైతే ఆమె పంట పండినట్లేగా మరి. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: