ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణం ఏమో గాని ఇప్పుడు కొంత మందికి ఆయన వైఖరి చాలా వరకు చికాకుగా మారింది అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్నికల తర్వాత నాలుగు రోజులు ప్రజల్లోనే ఉన్నా ఆ తర్వాత మాత్రం తన వైఖరి మార్చుకుని మళ్ళీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా పింక్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాలు ఉన్నాయి. 



అయితే ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కువగా రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు. ఆయన షూటింగ్ చేసే అవకాశం ఉందని భావించిన దర్శక నిర్మాతలు అడ్వాన్సు లు ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ అమరావతి ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి అంటున్నారట పవన్ కళ్యాణ్. అమరావతి ఉద్యమం కోసం ఆయన మళ్ళీ రెండు రోజుల్లో విజయవాడలో తిష్ట వేసే పరిస్థితి కనపడుతుంది. దీనితో ఒప్పుకున్న సినిమాలు పవన్ చేస్తారో లేదో అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.



ఈ సినిమాలు గనుక పవన్ పూర్తి చేయలేకపోతే మాత్రం ఆయనతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకి వచ్చే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. ఇటీవల సినిమా షూటింగ్ లో పాల్గొంటా అని చెప్పిన పవన్, వెళ్లి హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబుని కలిసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే అమరావతిలో ప్రజలతో మమేకం అవ్వాలి, రైతులతో సమావేశం అవ్వాలి అని బిజెపిని కాదని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనితో నిర్మాతలు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే కొనసాగితే మాత్రం తాము నష్టపోతామని అంటున్నారు.  మరి ఈ విషయం పవన్ వరకు చేరుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: