తెలుగు కమెడియన్ పృథ్వీ రాజ్ గురించి తెలియనివారుండరంటే, అతిశయోక్తి కాదేమో. మొదట అర కొరా వేషాలు వేసే పృథ్వి.. ఇటీవల కాలంలో గడిచిన 5 సంవత్సరాలలో సినిమాలలో వరుస అవకాశాలను పొందుతూ.. మంచి బిజీ అయ్యారు. ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేసిన పృథ్వికి పార్టీ అధికారంలోకి రాగానే, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మ‌న్ను చేసింది. 

 

అంతవరకూ బాగానే వుంది కానీ, ఈ క్రమంలో ఆయన ఓ మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా మాట్లాడిన ఆడియో టేపులు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ పదవి కాస్తా చిరిగిపోయింది. తద్వారా అతనికి సినిమాలలోని అవకాశాలు కూడా రావడం తగ్గు ముఖం పట్టాయి. ఈ విష‌యంపై అతను స్పందిస్తూ ‘‘నేను పార్టీకి విధేయుడైన కార్యకర్తని. అందుకే ఆరోప‌ణ‌లు రాగానే నా ప‌ద‌వికి రాజీనామా చేశాను.. అని తన విధేయతను చాటుకునే ప్రయత్నం చేసాడు. 

 

ఇక అవకాశం చిక్కునప్పుడల్లా.. పృథ్వి తన శీలతను చాటుకునే ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఇటీవల ఒకసందర్భంలో.. "నాకు పార్టీపై న‌మ్మ‌కం ఉంది. నాకు ఆ ప‌దవి ద‌క్క‌డం కొంద‌రికి న‌చ్చ‌లేదు. అందువలనే  నాపై కుట్ర చేసి న‌న్ను కావాలని ఇరికించారు. ఎటొచ్చి.. నా పీఏ, పి.ఆర్‌.ఒలే నన్ను మోసం చేస్తారని నేను   అనుకోలేదు. నన్ను ప్లాన్ ప్రకారం కుట్ర చేసి బ‌య‌ట‌కు పంపారు అని వాపోయారు.

 

అదంతా ఇపుడు పక్కన బెడితే.. ఇప్పుడు సినిమాల్లో కూడా అవ‌కాశాలు పోయాయి క‌దా! అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అవును... నేను చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాను... ఈ సమయంలో నాకు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో నుండి ఓదార్చిన ఏకైక వ్యక్తి చిరంజీవి అన్న అని, మెగాస్టార్ ని ఎక్కించే ప్రయత్నం చేసాడు. ఆయన చాలా గొప్ప వ్య‌క్తి అని, అవకాశాలు లేని నాకు మరలా చిరంజీవి అన్నగారే తాను నటిస్తున్న నెక్స్ట్ మూవీలో ఒక మంచి పాత్ర సజెస్ చేసారని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: