తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే హిట్ అనే మాట వినిపిస్తుంది.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  అయితే అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం ఫెయిల్ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  అంతే కాదు ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అల వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డులు నమోదు చేసుకుంది.  ఈ మద్య చిత్రాలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని డిలీల్ చేసిన సీన్లు తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.  

 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ డిలీటెడ్ సీన్‌ను చిత్రయూనిట్ యుట్యూబ్ లో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాజు (సుశాంత్) స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్నప్పుడు అల్ల అర్జున్.. సుశాంత్ కి ఓ వీడియో చూపిస్తాడు. అందులోసుశాంత్ మద్యం సేవించిన వీడియో ఉంటుంది. డబుల్ సిగరెట్ కాల్చుకుంటూ ఓ పోకిరలా కనిపిస్తాడు. ఇది 'అర్జున్ రెడ్డి 2'గా షార్ట్ పిల్మ్ తీస్తున్నానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తాడు.

 

ఇప్పుడు నేనేం చేయాలనీ రాజు అడగగా, ఆఫీస్‌కు బస్సులో వెళ్లేందుకు రాజు పరిగెత్తడం, వెనుక కారులో బంటి వీడియో తీయడం, అదే కారులో ఉన్న వాల్మీకి(మురళీశర్మ ) అల్లాడిపోవడం వంటివి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అరవింద్‌, రాధకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకి ముందు తమన్ పాటలు , త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: