కరోనా ఎఫెక్ట్ తో సాధరణ ప్రజానీకం నుండి సెలబ్రిటీలు వరకు అందరూ ఇంట్లోనే ఉండటంతో తమకు దొరికిన ఖాళీని ఒకొక్కరు ఒకో విధంగా ఉపయో గించుకుంటున్నారు. యంగ్ హీరో శుశాంక్ రెండు చేతులతో వ్రాసే విద్యను తన అభిమానులకు నేర్పిస్తుంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న గ్లామర్ బ్యూటి శ్రియ తనకు వచ్చిన ఒక వెరైటీ ఆలోచనను అమలు చేయడంతో అల్లు అర్జున్ ఇరుకున పడ్డాడు.
శ్రియ తన భర్త అండ్రీ కొస్చీవ్ తో గిన్నెలు తోమించింది. అంతేకాదు కొందరు హీరోలను నామినేట్ చేస్తూ వాళ్ళు కూడ తమ భార్యలు కోసం ఇలాంటి పనిచేయాలని ఛాలెంజ్ విసిరింది. ఈ లిస్టులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరసలో ఉన్నాడు. ఈ మేరకు తన భర్త అంట్లు తోముతున్న వీడియోను ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది శ్రీయ. దానికి ''గిన్నెలను శుభ్రం చేయండి'' అని కాప్షన్ జోడిస్తూ కొందరు మిత్రులకు ఆ ఛాలెంజ్ విసిరింది.
ఈ లిస్టులో అల్లు అర్జున్ తో పాటు ఆర్య ఆశిష్ చౌదరి జయం రవి ఉన్నారు. శ్రియ ఛాలెంజ్ ని స్వీకరించి వీరంతా తమ ఇళ్ళల్లో తమ భార్యలకు సహాయం చేస్తూ అంట్లు తోమవలసిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి శ్రియకు గిన్నెలు తోమడం ఇష్టముం ఉండదు. అంట్లు తోమడం కోసమే తాను పెళ్లి చేసుకున్నానని కూడ పెట్టింది శ్రియ.
అంతేకాదు ఇలాంటి కిస్ట పరిస్థితులలో పెళ్లయిన మగవాళ్ళంతా వారి అందమైన భార్యలకు ఏవిధంగా సాయం చేస్తారో చూపించాలని తన ఛాలెంజ్ లో కోరింది. శ్రియ విసరిన ఛాలెంజ్ వైరల్ గా మారడంతో బన్ని అభిమానులు అల్లు అర్జున్ కూడా అంట్లు తోమవలసి వచ్చే పరిస్థితులు ఈ కరోనా వల్ల ఏర్పడ్డాయి అంటూ భయపడుతున్నారు. దీనితో శ్రియ ఖాళీగా ఉంటూ తెలివిగా బన్నీని ఇరికించింది అంటూ తిట్టి పోసుకుంటున్నారు..