గడచిన రెండేళ్ల క్రితం తన కెరీర్ సిల్వర్ జూబిలీ సినిమా అయిన అజ్ఞాతవాసి లో నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తరువాత ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు కొంత విరామం ఇచ్చి, పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నం అయ్యారు. ఇక ఆ తరువాత నుండి పవన్ మళ్ళి సినిమాల్లో నటించాల్సిందే అంటూ పలువురు ఫ్యాన్స్ గట్టిగా పట్టుబట్టడంతో ఎట్టకేలకు తన మనసు మార్చుకుని, ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్నారు పవన్. ఇటీవల బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

IHG's format for PK's film | TeluguBulletin.com

ఇక మరోవైపు ఈ సినిమాతో పాటు, హృద్యమైన సినిమాల రూపకర్త క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న పవన్, వకీల్ సాబ్ అనంతరం దానిని రిలీజ్ చేయనున్నారు. అయితే కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి, ఆ సినిమాలో పవన్ ఒక గజదొంగ గా నటిస్తున్నారని, కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఎంతో భారీ రేంజ్ లో పాన్ ఇండియా ఫీల్ తో రూపొందుతున్న ఈ సినిమా, ఎంతో గొప్పగా  తెరకెక్కుతున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇక ఈ సినిమా విషయమై ఫిలిం నగర్ వర్గాల నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నిజంగానే ఈ సినిమా కథ, కథనాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు క్రిష్ సిద్ధం చేసారని, ఇక అదేవిధంగా సినిమాకు అవసరమైన మేరకు ఎంతైనా ఖర్చు చేయడనికి నిర్మాత ఏ ఎమ్ రత్నం కూడా సిద్ధం అయినట్లు చెప్తున్నారు. 

 

ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని ఏ దర్శకుడూ కూడా చూపనంత గొప్పగా, అలానే అభిమానులు, ప్రేక్షకుల మనసు దోచేలా ఆయన పాత్రని దర్శకుడు క్రిష్ రాసుకోవడం జరిగిందని, తప్పకుండా రేపు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయి థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్క పవన్ అభిమాని, మా హీరోని నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో చూపించారని దర్శకుడు క్రిష్ ని పొగడ్తలతో ముంచెత్తడం ఖాయం అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ద్వారా కన్నులపండుగ ఖాయం అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: