మన తెలుగులో కొందరు స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న హీరోలలో కూడా ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నారు. వారి సినిమాల కొందరు ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా వస్తే చాలు వాళ్లకు పండగ లాంటి వాతావరణం ఉంటుంది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు అనేది వాస్తవం. మన తెలుగులో చిన్న హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు కొందరు హీరోల సినిమాలకు మన తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అందులో నానీ శర్వానంద్ సినిమాలను బాగా చూస్తారు కొందరు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు వీళ్ళు ఇద్దరినీ నిర్మాతలు పట్టించుకోవడం లేదు. కొన్ని వర్గాల ప్రేక్షకులు వీరిని బాగా దగ్గర చేసుకున్నారు. అయితే వీరు ఇద్దరూ కూడా కొంత కాలంగా సరైన హిట్స్ ని సాధించడం లేదు. దీనిపై వారిలో కూడా అసహనం అనేది ఉంది. వారి సినిమాలను నిర్మించిన నిర్మాతలు కూడా నష్టాల్లోనే ఎక్కువగా ఉన్నారు అనేది అర్ధమవుతుంది. 

 

అందుకే ఇప్పుడు వాళ్ళ ఇద్దరినీ పక్కన పెట్టాలని భావిస్తున్నారు. శర్వానంద్ తో సినిమా ఒప్పుకున్నా వాళ్ళు కూడా వద్దు అని అంటున్నట్టు సమాచారం. నానీ సినిమాలను కూడా పక్కన పెట్టారు అని సమాచారం నానీ సినిమాలు గత రెండు మూడేళ్ళు గా ఒక్కటి కూడా మంచి విజయం సాధించడం లేదు. ఇప్పుడు దీనిపై అసహనం వ్యక్తమవుతుంది అతని అభిమానుల్లో కూడా అందుకే ఇప్పుడు నానీ ని పక్కన పెట్టడం పై కొందరు సోషల్ మీడియా లో విమర్శలు కూడా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని దర్శక నిర్మాతలపై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: