కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్.. త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడని వినిపిస్తోంది. అయితే విలక్షణ నటుడితో నటించబోయేది ఎవరో కాదు.. విక్రమ్ తనయుడే కావడం విశేషం. అంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చినా.. అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. ఆ తర్వాత ఎన్నో విభిన్న పాత్రలు చేసి మెప్పించిన విక్రమ్ కు.. ఈ మధ్య సరైన సక్సెస్ రావడం లేదు. అయినా ప్రయోగాత్మక చిత్రాలకే పెద్దపీఠ వేస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్ తో పాటు.. కోబ్రా, మహావీర్ కర్ణ.. అనే ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తున్నాడు. 

 

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు అయిపోగానే విక్రమ్ తన కొడుకుతో కలిసి.. ఓ భారీ యాక్షన్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట విక్రమ్ తనయుడు ధృవ్. ఆదిత్యవర్మ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదిత్యవర్మ తెలుగు హిట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత ధృవ్ తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం కథ కూడా రెడీ అయిందట. 

 

కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్.. ఇటీవల విక్రమ్ కు ఒక కథ వినిపించగా ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో ఇప్పటి నుంచే తండ్రీ కొడుకుల క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. అంతేకాదు ధృవ్ కెరీర్ స్టార్టింగ్ లోనే తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో.. విక్రమ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంటుందో చూడాలి. 

 

విక్రమ్ కు దక్షిణాదిన మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు ఆరాటపడితున్నారు. అందులో భాగంగానే కొత్త ఎక్స్ పెరిమెంట్లకు ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: