సాయిపల్లవి.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన `ఫిదా` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సాయి పల్లవి.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించిందని అనడంలో సందేహం లేదు. పక్కా తెలంగాణ అమ్మాయిగా.. భానుమతి పాత్రలో ఈ అమ్మడు ఒదిగిపోయింది.
ఈ సినిమా తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాల్లో నటించి.. మెప్పించింది. ఇక ఈ భామ అందగత్తే కాదు మంచి నటి కూడా. అవును! తాను ఎంచుకున్న ప్రతి సినిమాలోనూ మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే అందంతోనే కాకుండా.. నటనతోనూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది.
అంతేకాదు, తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. అయితే గ్లామర్ రోల్స్ కు ఫస్ట్ నుంచి దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. మిగత హీరోయిన్లు స్కిన్షోతో రెచ్చిపోతుంటే.. సాయి పల్లవి మాత్రం స్లీవ్లెస్ డ్రెస్ కూడా వేసేందుకు నో చెపుతోంది. అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం సాయిపల్లవి.. రానాతో విరాట పర్వం అనే సినిమా చేస్తోంది. అలాగే నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది.