వలస కార్మికులు ఉపాధి అవకాశాలు వెతుక్కునేందుకు 'ప్రవాసీ రోజ్గార్' అనే ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ యాప్ను ఆవిష్కరించారు సోనూసూద్. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు కనుగొనడంలో ఇది ఉపయోగపడుతుందని తెలిపాడు.కరోనా కారణంగా ఇరుక్కుపోయిన వలసకూలీలను సొంతూళ్లకు చేరవేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్.. తాజాగా వారికి మరో సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికోసం ఓ కొత్త యాప్ను ఆవిష్కరించారు. 'ప్రవాసీ రోజ్గార్' పేరుతో ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు కనుగొనడం సహా వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ యాప్ కార్మికులకు సహకారం అందిస్తుంది.
నిర్మాణం, ఆరోగ్యం, ఇంజినీరింగ్, బీపీఓ, సెక్యూరిటీ, ఆటోమొబైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ సెక్టార్స్, ఇతర ఉద్యోగ అవకాశాల సమాచారం ఇందులో లభిస్తుంది. ఇంగ్లీష్ సహా ఉద్యోగ శిక్షణ నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని ఇందులో అందుబాటులో ఉంచారు.
లాక్డౌన్లో వేల మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేరవేశారు ప్రముఖ నటుడు సోనూసూద్. అయితే ఇదంతా ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ అనుభూతికి అక్షర రూపాన్ని ఇచ్చి 'లైఫ్ ఛేంజింగ్' పేరిట పుస్తకం రాయనున్నట్లు తెలిపారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా.. ఈ పుస్తకాన్ని ప్రచురించనుందని వెల్లడించారు.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో వలస కూలీలు అనుభవించిన కష్టాలు కొత్తగా చెప్పనక్కర్లేదు. అటువంటి సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎందరో కార్మికులకు అండగా నిలబడి.. వారి పాలిట దైవంగా మారాడు. తాజాగా, లాక్డౌన్తో కిర్గిస్థాన్లో చిక్కుకున్న దాదాపు 3 వేల మంది విద్యార్థులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు సిద్ధమయ్యాడు సోనూ. వీరిలో 20 మంది బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
జులై 14న ఆసియా మెడికల్ ఇన్స్టిట్యూట్(ఏఎమ్ఐ)లో వైద్య శాస్త్రం చదువుతున్న ఒక విద్యార్థి తాము ఇంటికి వెళ్లేందుకు సాయం కావాలని కోరాడు. ఈ క్రమంలోనే ట్వీట్ చేస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ట్యాగ్ చేశాడు. విషయాన్ని తెలుసుకున్న సోనూ.. సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి