ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే కోర్టు డ్రామా మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అంజలి, నివేదాథామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు.

తొలిసారిగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వాటిలో ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ సినిమా కాగా మరొకటి అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. అయితే వీటిలో ప్రస్తుతం క్రిష్ సినిమా దాదాపుగా 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ట్లు సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం దాదాపుగా రూ. 200 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ పలు టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఏకంగా గోల్కొండ కోట సెట్ ని దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వ్యయంతో యూనిట్ నిర్మిస్తుందని, ఈ సెట్లో అతి త్వరలో తదుపరి షెడ్యూలు జరుపనున్నారని అంటున్నారు. తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: