టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ కోర్టు డ్రామా మూవీ వకీల్ సాబ్ రెండు రోజుల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పవన్ నుండి మూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావటంతో పలువురు ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానుల్లో కూడా దీనిపై ఎంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు నిజం చేస్తూ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఇందులో పవన్ కళ్యాణ్ సత్యదేవ్ అనే లాయర్ పాత్రలో నటించగా ఆయనకు పోటీగా వాదించే లాయర్ గా ప్రకాష్ రాజ్ కనిపించరు. ముఖేష్ రుషి, అంజలి, నివేదాథామస్, అనన్య నాగళ్ల, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాకి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందించగా తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా పలు కమర్షియల్ హంగులు కలగలిపి ఈ వాకీల్ సాబ్ మూవీని తెరకెక్కించడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ మంచి మార్కులు సంపాదించారని చెప్పాలి. మరోవైపు దిల్ రాజు నేటి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ పవన్ తో ఒక సినిమా చేయాలన్న ఎన్నో ఏళ్ల తన కల ఎట్టకేలకు వకీల్ సాబ్ ద్వారా తీరిందని పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని చూస్తుంటే తనకు అమితంగా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో వకీల్ సాబ్ కి సీక్వెల్ గా పార్ట్ 2 కూడా రూపొందనుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వేణు శ్రీరామ్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్ ల మధ్య కొంత చర్చలు జరిగాయని అతి త్వరలో దానికి సంబంధించి అధికారిక న్యూస్ కూడా వెలువడనుందని అంటున్నారు. అయితే దీనిపై ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: