రాజకుమారుడు మూవీ తో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ మూవీ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రెండవ సినిమా యువరాజు తో ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకున్న మహేష్, దాని అనంతరం వంశీ మూవీ తో పరాజయాన్ని చవి చూసారు. ఆపై కృష్ణవంశీ తో మహేష్ చేసిన మురారి మూవీ సూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా ఆయనకు పెద్ద బ్రేక్ ని అందించింది. ఇక అక్కడి నుండి మరింతగా దూసుకెళ్లిన మహేష్, గుణశేఖర్ తీసిన ఒక్కడు మూవీ తో కెరీర్ లోనే అతి పెద్ద సక్సెస్ ని అందుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోగా బాగా క్రేజ్ దక్కించుకున్నారు.

ఆ తరువాత త్రివిక్రమ్ తో అతడు, పూరి తో పోకిరి వంటి భారీ విజయాలతో సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న మహేష్ తన కెరీర్ లో చాలానే ప్రయోగాత్మక సినిమాలు చేసారు అనే చెప్పాలి. ముఖ్యంగా రెండవ సినిమా యువరాజు మూవీ తోనే అతి పెద్ద ప్రయోగం చేసిన మహేష్, ఆపై ఆయన చేసిన కౌబాయ్ మూవీ టక్కరిదొంగ కూడా ప్రయోగాత్మక మూవీనే. అలానే దాని అనంతరం నిజం, నాని, వన్ నేనొక్కడినే, స్పైడర్, వంటి ప్రయోగాత్మక సినిమాలు చేసిన మహేష్ వాటి ద్వారా చాలా వరకు ఫ్లాప్స్ ఎదుర్కోక తప్పలేదు.

అందుకే ఆ తరువాత నుండి ఒకింత జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగిన మహేష్, ఇటీవల ఎక్కువగా కమర్షియల్ ఫార్ములా సినిమాలకే మొగ్గుచూపుతున్నారు. దానికి ప్రధాన కారణం, తన వంటి పెద్ద హీరో ప్రయోగాత్మక సినిమా చేసి ఒకవేళ అది ఫెయిల్ అయితే నిర్మాతలు, బయ్యర్లు సహా ఎందరో నష్టపోవలసి వస్తుందని, అందుకే ఇకపై అటువంటి ప్రయోగాలు చేసే ఓపిక లేదని తనవద్దకు వస్తున్న పలువురు దర్శకులకు గట్టిగా చెప్తున్నారట మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట మూవీ తదుపరి షెడ్యూల్ ప్రస్తుత కరోనా పరిస్థితులు చక్కబడిన అనంతరం మొదలు కానుంది.  హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: