ఇండస్ట్రీ నాకు ఎన్నో విషయాలను మరియు మెలకువలను నేర్పింది. మొదట ఈవీవీ సత్యనారాయణ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈవీవీ అంటేనే డిసిప్లేన్, పంక్చువాలిటీ ఓ ప్రణాళిక ప్రకారం తన పని తాను ఖచ్చితంగా చేసుకుపోతారు. అలాగే చేయిస్తారు కూడా, ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు పక్కా టైమింగ్ ప్రకారం పూర్తి చేయడం ఆయన నైజం. అంత డిసిప్లేన్, డెడికేషన్ ఉన్న డైరెక్టర్ ని నేను ఇంతవరకు చూడలేదు అంటూ ఈవివిని ప్రశంసలతో ముంచెత్తారు దర్శకుడు వీరభద్ర చౌదరి. అలాంటిది ఆయన తనయుడు అల్లరి నరేష్ తో నా మొదటి సినిమా ప్రారంభం అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు, యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది.
ఎక్కువ సమయం వారి ఇంటి దగ్గర గడుపుతుండటం వలన ఖాళీ దొరికినప్పుడల్లా నేను నరేష్, రాజేష్ గారు కలసి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. నరేష్ తో చాలా చనువుగా ఉండేవాడిని అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక కింగ్ నాగ్ తో సినిమా చేసేటప్పుడు చాలా అంచనాలు ఉండేవి, ఒక వేళ అది కనుక సక్సెస్ అయి ఉంటే నాకు ఇంకో లాగా ఉండేది. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఎప్పుడూ చాలా కూల్ గా ఉంటారు. అందరితోనూ చాలా సరదాగా ఉంటారు అని అన్నారు. ఇక వరుస సినిమాలు చేసే విషయానికొస్తే, చేస్తే మంచి కథతో మంచి హీరోని పెట్టి తీయాలి, లేదంటే ఖాళీగా ఉండాలి. అప్పుడు వెంటనే వ్యాఖ్యాత రావు గోపాల్ వర్మ గురించి టాపిక్ తీసుకురాగా, ఇప్పుడు ఆ జీవి కాంట్రవర్సీలు మధ్యలో ఎందుకండి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ వీరభద్ర చౌదరి ఆది సాయికుమార్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలతో మొదటి స్టెప్ వేశారు.