సాధారణంగా ఎంతో మంది కొత్త దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  అయితే కొంతమంది దర్శకులు మాత్రం ఎన్ని సినిమాలు చేసినా సరైన క్రేజ్ మాత్రం దక్కించుకో లేకపోతు ఉంటారు.  మరికొంతమంది ఒక్క సినిమాతోనే ఊహించలేనంత క్రేజ్ సంపాదించుకుంటారూ. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమాతోనే రికార్డులు సృష్టించి ఊహించలేనంత క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.  ఒక సాదాసీదా హీరోగా ఉన్న విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కించి ఇక స్టార్ డైరెక్టర్ గా. మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా  సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.




 అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఇక అందరి హీరోల చూపులు ఈ దర్శకుడిపై పడ్డాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఇదే సినిమాను అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కబీర్సింగ్ అనే పేరుతో తెరకెక్కించి మరోసారి తన సత్తా చాటి సూపర్ డూపర్ హిట్ సాధించాడు సందీప్ రెడ్డి వంగ. అయితే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా మొదట అల్లు అర్జున్ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ కథకు అల్లు అర్జున్ నో చెప్పడంతో చివరికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేయాల్సి వచ్చింది అన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉంది.


 ఇకపోతే ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పై ప్రస్తుతం అందరు స్టార్ హీరోలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతంలో ఒక సినిమాను రిజెక్ట్ చేసినప్పటికీ ఈ సారి మాత్రం సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట.  దీంతో రెడ్డి గారి ఫోకస్ బన్నీ   వచ్చేసింది అంటూ అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ యాక్షన్ అనేసరికి ఏ రేంజ్లో ఉండబోతుంది అనేసరికి ప్రస్తుతం అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: