టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో కార్తికేయ కు జంటగా పాయల్ రాజ్ పుత్ నటించింది .ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ హీరో కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో భాగంగా హిప్పి , గుణ 369 , 90 ఎం ఎల్  సినిమాలో నటించాడు. వీటిలో  'గుణ 369' సినిమా  పర్వాలేదు అనిపించుకుంది .మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.


కార్తికేయ నుంచి చివరగా వచ్చిన సినిమా 'చావు కబురు చల్లగా' ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ హీరో చిరంజీవి హీరోగా నటించి 1990 లో విడుదలైన 'రాజా విక్రమార్క' సినిమా పేరును తన సినిమా పేరు గా పెట్టుకున్నాడు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్య విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా బక్రీద్ సందర్భంగా మరొక పోస్టర్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో కార్తికేయ ముస్లిం వేషధారణలో లో ఉన్నాడు. ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ని బట్టి చూస్తే ఇదొక కొత్త రకం స్టోరీ లా అనిపిస్తుంది.


 ఈ సినిమాను 'శ్రీ చిత్ర మూవీ మేకర్స్' బ్యానర్ పై మొదటి సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి స్వరాలు సమకూరుస్తూ ఉండగా రామిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడలో స్టార్ హీరో అయినా రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్ర ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తనికెళ్ల భరణి ,సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కార్తికేయ కు ఎలాంటి సక్సెస్ ను తెచ్చిపెడుతుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: