సూపర్ స్టార్ మహేష్ బాబు - టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమాపై కేవ‌లం తెలుగులో మాత్ర‌మే కాకుండా.. దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. వీరి కాంబినేష‌న్లో 15 సంవ‌త్స‌రాలుగా సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే రాజ‌మౌళి ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ - ర‌వితేజ - సునీల్ - ప్ర‌భాస్ ఇలా అంద‌రు స్టార్ హీరోల‌తో సినిమా చేసినా మ‌హేష్ తో మాత్రం చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్లో డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమాను సెట్ చేశారు.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ కాంబినేష‌న్లో ఆర్ ఆర్ ఆర్ ( రౌద్రం రణం రుధిరం ) సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ఆర్ ఆర్ ఆర్ ను రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ - రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలెక్క నుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమాకి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ ఒక స్ట్రాంగ్ సబ్జెక్టు పై వర్క్ చేస్తున్నాన‌ని ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లోనే ఒక సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ గా ఈ సినిమా వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ సినిమా జేమ్స్‌బాండ్ స్టైల్లో ఉంటుంద‌ని ముందు నుంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే మ‌హేష్ - రాజ‌మౌళి ఆఫ్రిక‌న్ అడ‌వుల్లో అదిరిపోయే యాక్ష‌న్ తో మ‌న‌కు వీనుల విందు చేస్తార‌ని అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: