ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో కిరాక్ పార్టీ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ దర్శకులు చూపులు ఆకర్షించింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే చలో సినిమా తో నాగశౌర్య తో జోడీ కట్టింది రష్మిక మందన. ఇక టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అదృష్టం బాగానే కలిసొచ్చింది. దీంతో మొదటి సినిమా మంచి విజయాన్ని సాధించింది.



 అదే సమయంలో రష్మిక మందన్న అందం అభినయం కూడా తెలుగు ప్రేక్షకులందరికీ కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు రష్మిక మందన్న సొంతం చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే అప్పటికే ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో ఆఫర్ కొట్టేసింది రష్మిక మందన. ఇక ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ రేణురేంజ్ సంపాదించడానికి కొంత దూరంలో ఆగిపోయింది. అంత లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రష్మిక కెరీర్ మరింత స్పీడందుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది రష్మిక మందన. ఇప్పటికే  అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది రష్మిక. అయితే ఇక ఇటీవలే ఒక తమిళ హీరో తో సినిమా చేసేందుకు రష్మిక సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. తమిళ్ హీరో శివ కార్తికేయన్ జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కాంబినేషన్లో తెలుగు తమిళ భాషల్లో ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన ను అనుకుంటున్నారట. ఎందుకంటే రష్మిక మందన హీరోయిన్ గా తీసుకుంటే అటు తమిళంతో పాటు తెలుగులో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని చిత్రబృందం భావిస్తున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: