బుచ్చిబాబు ఆశలకు అడియాశలవుతున్నాయి. ఇన్నాళ్లూ భారీ సినిమా చేయాలనుకున్న బుచ్చిబాబుకి పరిస్థితులు కలిసిరావడం లేదు. లార్జ్ స్కేల్ సినిమా చేయాలంటే మరో రెండేళ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి. దీంతో ఈ గ్యాప్ని కవర్ చేసేందుకు ఒక మెగా ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడట బుచ్చిబాబు.
బుచ్చిబాబు సనా ఫస్ట్ మూవీ 'ఉప్పెన'తో సెన్షేనల్ హిట్ కొట్టాడు. ఈ బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు స్టార్ హీరోస్ని డైరెక్ట్ చేస్తాడనే ప్రచారం జరిగింది. జూ.ఎన్టీఆర్తో ఒక స్పోర్ట్స్ డ్రామా తీస్తాడనే టాక్ కూడా వచ్చింది. స్టోరీ నెరేషన్ అయిపోయిందని తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే మాటలు వినిపించాయి.
జూ.ఎన్టీఆర్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'ట్రిపుల్ ఆర్' సెట్స్లో ఉండగానే కొరటాల శివతో ఒక పాన్ ఇండియన్ మూవీకి సైన్ చేశాడు. అలాగే ప్రశాంత్ నీల్తోనూ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశముందట.
జూ.ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేలోపు మరో మూవీ చెయ్యాలనుకుంటున్నాడట బుచ్చిబాబు. ఫస్ట్ హీరో వైష్ణవ్ తేజ్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీ కూడా మైత్రీమూవీ మేకర్స్లోనే నిర్మాణమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక వైష్ణవ్ ఇప్పుడు క్రిష్ సినిమాతో పాటు, గిరీషాయ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత బుచ్చిబాబు సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.