ఇటీవలే బైక్ యాక్సిడెంట్ కి గురయ్యాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల ముంగిట భారీ యాక్సిడెంట్ కావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఎంతగానో కలవరానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఈ సినిమా విడుదల వాయిదా అవుతుందా అన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తపరిచారు. కానీ నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపారు. ప్రమాదానికి గురైన వెంటనే అపస్మారక స్థితికి వెళ్ళిన సాయి ధరమ్ తేజ్ ట్రీట్మెంట్ చేసిన రెండు రోజులకు గానీ స్పృహ లోకి రాలేదు.

డాక్టర్లు కూడా 24 గంటలు గడవకముందే ఏమీ చెప్పలేమని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా కంగారు మొదలైంది. ఓవర్ స్పీడ్ కారణంగా హెల్మెట్ పెట్టుకుని ఉన్న సాయిధరమ్ తేజ్ కి ఈ యాక్సిడెంట్ కాగా హెల్మెట్ ధరించడం వల్ల పెద్దగా ప్రమాదం ఏమి లేకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే హెల్మెట్ పెట్టుకోవడం ఆయనను ఎంత గా కాపాడిందో అందరూ హెల్మెంట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని ఈ ఘటనే నిదర్శనం. ఇకపోతే రిపబ్లిక్ సినిమా విషయం గురించి మొదటిసారి ఆయన తన సోషల్ మీడియా లో ఒక పోస్టు ద్వారా స్పందించాడు. 

అక్టోబర్ 1న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయగా ఆడియో ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రానున్నాడని తెలుస్తోంది. ఏదేమైనా సాయిధరమ్ తేజ్  లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులు స్టార్ హీరోలు ఈ విధంగా తమ తోటి హీరో సినిమా ను భుజాల మీద వేసుకొని ప్రమోషన్ చేయడం ఇప్పుడు అందరినీ ఎంతో సంతోషానికి గురి చేస్తున్న విషయం. ఇక ఈ సినిమా గురించి సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ రిపబ్లిక్ సినిమా ను అందరూ తప్పకుండా చూడాలని మంచి మెసేజ్ తో రాబోతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అని కూడా అన్నారు. మరి దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: