టాలీవూడ్ ఇండస్ట్రీలో బాబాయి ,అబ్బాయి అనగానే ముందుగా గుర్తొచ్చేది.. బాలయ్య ఆ తర్వాత ఎన్టీఆర్. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసులుగా అడుగుపెట్టినా.. వీరిద్దరూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి తారకరామారావు కొడుకుగా బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వగా.. నందమూరి తారక రామారావు మనువడిగా జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ ఇద్దరి స్టార్ల గురించి పరుచూరి గోపాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొట్టమొదటి సారి వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారో ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. పాలకొల్లులో ఎన్టీఆర్ హీరోగా అల్లరి రాముడు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక  అక్కడ నాతో పాటు ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి వారందరూ ఉన్నారని తెలిపారు. అయితే ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నా దగ్గరకు వచ్చి మీరు తాత ఎన్టీఆర్ కి ఎలా అభిమానియో.. నేను బాబాయ్ బాలకృష్ణకి కూడా అంతే అభిమానిని అని చెప్పారు. కాగా..బాబాయ్ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడల్లా పేపర్లు చించి విసిరేస్తూ చాలా ఎంజాయ్ చేశాను అని ఎన్టీఆర్ తెలిపినట్లు పరుచూరి చెప్పుకొచ్చారు.

అయితే అప్పుడు పరుచూరి బాబాయ్ తో ఈ విషయాన్ని చెప్పావా.. అని అడిగినప్పుడు.. లేదు నాకు బాబాయి అంటే చాలా భయం అందుకే ఈ విషయాన్ని తనకు చెప్పలేదు అని ఎన్టీఆర్ సమాధానం చెప్పారంట. అంతేకాక మీ బాబాయ్ కి నిన్ను పరిచయం చేస్తాను రా అంటూ అదే సెంటర్లో ఉన్న బాలకృష్ణ దగ్గరకు ఎన్టీఆర్ చేతిని పట్టుకొని, పరుచూరి గోపాలకృష్ణ తీసుకెళ్లాడు. అంతేకాదు.. బాలయ్య బాబు కు పరిచయం చేయించి మాట్లాడించారంట.

ఇక ఎన్టీఆర్ , బాలకృష్ణను ఒక బాబాయ్ మాదిరిగా కాకుండా ఒక అభిమానిగా మొట్టమొదటిసారి పాలకొల్లులో కలిశారని పరుచూరి గోపాలకృష్ణ చెప్పొకొచ్చారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తూ ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, మరొక సినిమా షూటింగ్ కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: