ఈయన ఇక కవి మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమకారుడు కూడా, తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. బుర్ర కథను ఎంచుకుని తెలంగాణ ఉద్యమం కోసం ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం పెంచారు. ముఖ్యంగా దళితుల్ని మెల్కొల్పి వారి జీవితాల్లో వెలుగులు రావాలని కోరుకునే వ్యక్తిగా ఈయన రచించిన పాటలు వింటే గూస్ బమ్స్ రావాల్సిందే. ఈయన రాసే పాటలలో ఎక్కువగా ప్రజలను మంచి మార్గం వైపు నడిపే విధంగా ఉంటాయి. చూడటానికి చాలా సాదా సీదాగా కనిపించే ఈ మహా కవి గొప్ప విద్యావంతుడు. హైదరాబాద్ లో తన ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు గద్దర్. ఈయన రచించిన చాలా పాటలు అవార్డులు సైతం అందుకున్నాయి.
ఈయన రచించిన 'నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..' అనే పాటకు గాను నంది అవార్డు వచ్చింది. కానీ ఈయన ఆ అవార్డును తిరస్కరించారు. ప్రజల గుండె చప్పుడు విన్న రచయితగా గద్దర్ గుర్తింపు పొందారు. నాటక రంగంలోనూ ఈయన సుప్రసిద్ధుడు. ఆయన ఎన్నో నాటకాలలో కూడా నటించి ప్రజల్లో చైతన్యం కలిగించారు.