నిన్న విడుదలైన ‘ఆఖండ’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో పెద్ద సినిమా నిర్మాతలు అంతా మంచి జోష్ లో ఉన్నారు. దీనితో క్రిస్మస్ కు ముందు డిసెంబర్ 17న విడుదల కాబోతున్న ‘అఖండ’ మూవీ ప్రమోషన్ ను మరింత భారీగా చేసి ఈ మూవీ కలక్షన్స్ ను పెంచుకోవాలని ‘పుష్ప’ మూవీ నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారు.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి ఒక న్యూస్ కొద్దిరోజుల క్రితం హడావిడి చేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ అతిధిగా రాబోతున్నాడు అంటూ ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆతరువాత ఈ వార్త పై క్లారిటీ ఇస్తూ ఈ మూవీ యూనిట్ క్లారిటీ కూడ ఇచ్చింది. ఈ మూవీ ఫంక్షన్ కు సంబంధించి ముఖ్య అతిధి ఎవరు ఫైనల్ కాలేదని క్లారిటీ ఇచ్చారు.


ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ హడావిడి మొదలైంది. ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం త్వరలో జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా పిలిచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. గతంలో ‘చెప్పను బ్రదర్’ కామెంట్స్ తో అల్లు అర్జున్ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.


ఇప్పుడు ఇండస్ట్రీలో అందరివాడుగా మారాలని ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ పవన్ అభిమానులతో తనకు ఏర్పడిన ఆ గ్యాప్ ను తోలిగించుకుని పవన్ అభిమానుల కోపాన్ని తగ్గించే విధంగా పవర్ స్టార్ ను ‘పుష్ప’ ప్రీ రిలీజ్ వేడుకకు అతిధి గా పిలిచి కొత్త వ్యూహాలు అనుసరించాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి పవన్ ను ఒప్పించడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగాడు అని టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: