పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా తొలిసారిగా కలిసి నటిసున్న సినిమా భీమ్లా నాయక్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం సినిమాకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రిప్ట్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఇద్దరు హీరోల టీజర్స్, సాంగ్స్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా డ్యానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఇద్దరి మధ్య ఈగో సమస్యల కారణంగా తలెత్తిన పరిరణామాల నేపథ్యంలో సాగే యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే విషయం ఏమిటంటే వాస్తవానికి ఈ సినిమాని సంక్రాంతి పండుగా కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలని భావించారు. కాగా అదే సమయానికి ఆర్ఆర్ ఆర్ మూవీ రిలీజ్ కూడా ఉండడంతో భీమ్లా ని కొన్నాళ్లపాటు వాయిదా వేసింది యూనిట్.

ఇక ఇటీవల తమ మూవీని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా భీమ్లా నాయక్ యూనిట్ ప్రకటించింది. అయితే ఈసారి మాత్రం పక్కాగా అనుకున్న డేట్ కె సినిమాని రిలీజ్ చేసేలా మేకర్స్ గట్టిగా పట్టుదలతో ఉన్నారని, మరోవైపు ఆల్మోస్ట్ చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ని ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరోవైపు కొన్నాళ్లుగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నపటికీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకి ఫ్యాన్స్ ముందుకు సినిమా తీసుకువచ్చేలా అటు పవర్ స్టార్ పవన్ కూడా గట్టిగా రిస్క్ చేసి డేరింగ్ గా షూటింగ్ కి హాజరవుతున్నారని అంటున్నారు. మరి భీమ్లా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: