సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని లేదు, కొందరు ఫెయిల్ అవుతారు.. అంతేకాదు కష్టాలు నష్టాలు అన్నీ తట్టుకుని నిలబడగలిగితే మాత్రం తప్పకుండా సక్సెస్ ను చూడగలము. అయితే అలా టాలీవుడ్ లోకి వచ్చి కొంత సక్సెస్ పొందిన తరువాత ఫెయిల్యూర్ అయ్యి చాలా కాలం నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఒకప్పటి హీరో రాజా. కాగా రాజా హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. కెరీర్ మొదట్లో శేఖర్ కమ్ములతో చేసిన ఆనంద్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఒక నటుడిగా మరో మెట్టు ఎక్కించిన చిత్రం మాత్రం 'ఆ నలుగురు' అని చెప్పాలి. అయితే కాలం కలిసిరాక ఇప్పుడు సినిమాలకు దూరం అయిపోయాడు.

ఇప్పుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన రాజా మత బోధకుడిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. అయితే సినిమా అనేది అందరికీ ఒక వినోదం లాంటిది. దీనికోసం మీ పనులు మానుకుని గంటలు గంటలు క్యూ లో నిల్చుని సినిమా చూడాల్సిన అవసరం లేదు. సినిమా ఒక పనికిమాలినది అంటూ ఇండస్ట్రీని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో రాజా హాట్ టాపిక్ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు సినిమాను అభిమానించే వారందరికీ శత్రువులా మారిపోయాడు.

అయితే ఈ విషయాన్ని అందరూ పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఎందుకంటే తనకు జీవితాన్ని ఇచ్చిన సినిమా పరిశ్రమను ఈ విధంగా మాట్లాడినంత మాత్రాన ఏమీ కాదు. ఇదే సినిమా పరిశ్రమ లో ఒకప్పుడు రాజా ఆదరణ పొందిన వాడే అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఈ విషయంపై పెద్దగా సీరియస్ అయిన దాఖలాలు కనిపించం లేదు. ఇక ముందు ఏమైనా అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: