నందమూరి బాలకృష్ణ కెరియర్ లో నటించిన అఖండ సినిమా మాస్ హిట్ గా నిలిచి బాలయ్య కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్ అఖండ 2 ఈ రోజున (డిసెంబర్5) భారీ అంచనాల మధ్య విడుదలకావలసి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అయ్యింది. అయితే అఖండలో హీరోయిన్గా నటించిన ప్రగ్యా జైస్వాల్ అఖండ 2 తాండవంలో కనిపించకపోవడంతో ఈ విషయం పైన అభిమానులు ఆరాతిస్తున్నారు.


సాధారణంగా ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే ఆ సినిమా సీక్వెల్ వస్తున్నప్పుడు కచ్చితంగా అందులో కీలకమైన  నటీనటులు  నటిస్తూ ఉంటారు. అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పాత్ర కీలకం కానీ అఖండ 2లో ఎందుకు తొలగించారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.. ఈ పాత్ర తొలగింపు వెనుక డైరెక్టర్ బోయపాటి శ్రీను నిర్ణయం ఉందా ?లేకపోతే కథపరంగా ఏదైనా తొలగించారా అన్న విషయం పై స్వయంగా నందమూరి బాలకృష్ణ అనే అసలు విషయాన్ని బయటపెట్టారు.


అఖండ 2 చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పాత్ర తొలగింపు వెనుక ఉన్న కారణాన్ని  బాలయ్య వివరణ ఇచ్చారు.. ఈ నిర్ణయం కేవలం పాత్ర ముగింపు పైన ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పాత్రకు సంబంధించి కథ పూర్తి అయ్యిందని, ఆమె పోషించిన కలెక్టర్ పాత్రకు ఆ సినిమాలోనే ఒక ముగింపు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. సాధారణంగా  సీక్వెల్స్ లలో,మొదటి భాగం కథలో సజీవంగా ఉండే పాత్రలను మాత్రమే కొనసాగిస్తారు. అఖండ స్టోరీ పరంగా ఆ కలెక్టర్ పాత్రకు సంబంధించి అన్ని అంశాలను కూడా మొదటి భాగంలోనే పూర్తి అయ్యాయి. అందుకే అఖండ 2 సినిమాలో ఆమె పాత్ర అవసరము లేదు ఆ కారణంగానే రెండవ భాగంలో ఆమెను కొనసాగించలేదని బాలయ్య తెలియజేశారు.


దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ నిర్ణయం వెనుక ఎటువంటి విభేదాలు కాని వ్యక్తిగత కారణాలు లేవని కేవలం సినిమా కథ, సహజత్వం కోసమే తీసుకున్న నిర్ణయం అని కనిపిస్తోంది. అందుకే కొత్త కొత్త పాత్రలు కొత్త నటి నదులను తీసుకున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: