మంచి డిఫరెంట్ జోనర్ సినిమాలతో తనదైన ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్.. రీసెంట్‌గా 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో ఓ మోస్తారు హిట్ కొట్టాడు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఇతనికి క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ యంగ్ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట! తన కూతురు ఐశ్వర్య అర్జున్‌నే ఇందులో హీరోయిన్ గా నటింపజేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.అర్జున్ సర్జా ఒక గొప్ప నటుడే కాదు, ఆయన మంచి దర్శకుడు కూడా! అర్జున్ 1994లో 'జై హింద్' సినిమాకు దర్శకత్వం వహించాడు. అది తెలుగు ఇంకా తమిళ భాషల్లో హిట్టయ్యింది. 2002లో బాలయ్య 'నరసింహ నాయుడు' సినిమా 'ఎళుమళై'గా రీమేక్ చేసి, విజయం సాధించాడు. అలాగే 2014లో వచ్చిన 'జై హింద్ 2' సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు.



ఇప్పుడు తన దర్శకత్వంలో విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేసేందుకు యాక్షన్ కింగ్ రంగం రెడీ చేస్తున్నాడు. దీన్ని.. తెలుగు – తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారని సమాచారం వినిపిస్తోంది.ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోందని ఇంకా దర్శకుడిగా తన ప్రతిభ చాటేందుకు యాక్షన్ కింగ్ ఈ సినిమాకి శ్రీకారం చుట్టేందుకు బాగా సిద్ధమయ్యాడని ఇన్‌సైడ్ న్యూస్! త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన కూడా రానుందని సమాచారం. ఇదిలావుండగా.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విశ్వక్ ఇక త్వరలోనే హిందీలో దర్శకుడిగా తెరంగేట్రం చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే! మొత్తానికి యాక్షన్ కింగ్ నే మెప్పించాడంటే విశ్వక్ మంచి జాక్ పాట్ ఛాన్స్ నే కొట్టేసాడు. ఇక ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ కి ఎంత పెద్ద ప్లస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: