టాలీవుడ్ లో ఎందరో నటులు అకాల మరణం చెందారు.. వారిలో నటుడు అచ్యుత్ కూడా ఒకరు. ఏఒక్కసారిగా తమ అభిమాన నటుడు చనిపోతే ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతారు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అచ్యుత్ ఒక నటుడిగా తన ప్రస్థానాన్ని బుల్లితెర నుండే స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా దూరదర్శన్ మరియు ఈటీవీ లలో వచ్చే సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఇక సినిమాలలోనూ స్టార్ హీరోలతో నటించి మెప్పును పొందాడు అచ్యుత్. ఇక చిరంజీవి సినిమాలనే చూస్తూ అతనికి ఫ్యాన్ గా మారిపోయాడు. అంతా బాగుంది... కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే గుడినేపోతూ తో అచ్యుత్ ప్రాణాలు కోల్పోయాడు.

అయితే అప్పట్లో ఇతని చావు గురించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి. మాములుగా ఎవరైనా ఒక రంగంలో సంపాదించిన డబ్బును వేరే రంగాల్లో పెట్టుబడిగా పెట్టి దాన్ని రెట్టింపు చేయడానికి చూస్తారు. ఇదే విధంగా అచ్యుత్ కూడా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేశాడు. అయితే వ్యాపారాలను థానే స్వయంగా చూసుకోవడం కుదరదు కాబట్టి ఆ బాధ్యతను తనకు బాగా నమ్మకమైన వారి చేతుల్లో పెట్టాడు. అయితే బాగా నమ్మినవాడే మోసం చేస్తారని తెలిసిందే. అదే విధంగా తన డబ్బును వీరు కాజేశారు.. అలా వ్యాపారాల్లో నష్టం వచ్చింది. దీనితో ఒక్కసారిగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయాడు అని సన్నిహితులు కొందరు అంటూ వచ్చారు.

అయితే తన గురించి బాగా తెలిసిన నటుడు, దర్శకుడు మరియు ఫ్రెండ్ ప్రదీప్ కొన్ని విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. వాస్తవంగా ఇప్పటి వరకు వైరల్ అయినవి అన్నీ అబద్దాలు. అచ్యుత్ బాడీలో అధిక కొలెస్టరాల్ కారణంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు. అందుకే ఎంత డబ్బు ఉన్న హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ప్రముఖులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: