లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా విక్రమ్. విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా మల్టి వర్స్ మూవీగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ అయిన విక్రమ్ మూవీ విడుదలైన అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. పక్కా యక్షన్ తో పాటు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో ఎంతో అద్భుతంగా దర్శకుడు లోకేష్మూవీ తెరకెక్కించి అందరినీ అలరించారు.

కమల్ ఈ మూవీలో ఒక రా ఏజెంట్ పాత్ర చేయగా యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ దీనికి స్వరాలు సమకూర్చాడు. రాజ్ కమల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో విక్రమ్ మూవీని స్వయంగా నిర్మించారు కమల్ హాసన్. ఇక ప్రస్తుతం మూవీ ఎంతో భారీ స్థాయిలో దూసుకెళ్తుండడంతో దర్శకుడు లోకేష్, నటుడు నిర్మాత కమల్ సహా యూనిట్ మొత్తం కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. నిన్న ఈ మూవీ సక్సెస్ మీట్ ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన కమల్, భవిష్యత్తులో దర్శకుడు లోకేష్ తనతో సినిమాలు చేయనప్పటికీ అతడికి ఎప్పుడూ తన సపోర్ట్ ఉంటుందని అన్నారు.

ఇక ముఖ్యంగా ప్రస్తుతం విక్రమ్ మూవీ ఏకంగా మూడొందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ఇటు తమిళ్ నాడు లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని, అయితే తమ మూవీకి ఇంత భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తోందనే ఆనందం కంటే కూడా కెరీర్ పరంగా చాలా ఏళ్ళ తరువాత తాను ఎంతో ఆనందంగా ఉన్నానని, ఇటీవల కొన్నాళ్లుగా హ్యాపీగా మనస్ఫూర్తిగా భోజనం చేస్తున్నానని చెప్పిన కమల్, అన్ని విధాలా తనకు రిలీఫ్ నిచ్చిన సినిమా విక్రమ్ అని అన్నారు. మొత్తంగా దీనిని బట్టి విక్రమ్ మూవీ కమల్ కి అటు డబ్బు తెచ్చిపెట్టడంతో అపాటు ఈ విధంగా మానసికంగా కూడా మంచి చేసిందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: