పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా హరిహరవీరమల్లు. క్రిష్ తీస్తున్న ఈ మూవీలో ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా నోరా ఫతేహి ఒక కీలక రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పాత్రకి గాను మొదట జాక్వలీన్ ఫెర్నాండేజ్ ని తీసుకున్నారు యూనిట్, అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన ఆమె స్థానంలోకి నోరా వచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తుండగా దీనిని ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా మూవీగా ఎంతో అద్భుతంగా తీస్తున్నారట దర్శకుడు క్రిష్.

ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై అందరిలో మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచింది. అయితే గత కొన్నాళ్లుగా  తన జనసేన పార్టీ తరపున కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం అయి ఉన్న పవన్ కళ్యాణ్, ఇటీవల హరిహర వీరుమల్లు మూవీ షూట్ కి విరామం పలికినట్లు చెప్తున్నారు. అలానే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది పవన్. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఏ మాత్రం తీరిక లేకుండా గడుపుతూ ఉండడంతో, ఇటీవల ఈ రెండు సినిమాల విషయమై కొంత అస్పష్టత నెలకొన్నట్లు సమాచారం.

అసలు వీటిలో ఏది పక్కాగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఏది లేట్ అవుతుందో కూడా సరిగా అర్ధం కాక కొందరు పవన్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. అందుకే మరొక రెండు రోజుల్లో ఈ రెండు సినిమాల యూనిట్స్ విడి విడిగా పవన్ ని కలిసి వీటికి సంబంధించి పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఒకవేళ అవి సెట్ అయితే పవన్ మూవీస్ రెండూ కూడా పట్టాలెక్కినట్లే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: