తెలుగు అగ్ర హీరో మాస్ మహరాజ రవి తేజ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు.రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.ఇటీవల ఈ సినిమా గురించి ఎక్కడ చూసిన వినిపిస్తోంది. కంప్లీట్ మాస్ యాక్షన్ తో రవి తేజ పవర్ పాత్ర ఉండనుంది.ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా, ఇందులో రవితేజ ఓ పవర్ ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మరోసారి మాస్ రాజా రెడీ అవుతున్నాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూలై 16న సాయంత్రం 6 గంటల నుండి పార్క్ హయత్ లో ఈ ట్రైలర్ లాంఛ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ కు ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు మాస్ డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది..


అందులో ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ, నక్కిన త్రినాథ రావు, సుధీర్ వర్మ, వంశీ కృష్ణ నాయుడు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకకు హాజరుకాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, ఈ సినిమాలో రవితేజతో పాటు వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది...ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: