గ్లామరస్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లో దగ్గుబాటి రానా కు జోడిగా నటించింది .

భీమ్లా నాయక్ సినిమా విడుదల కాక ముందే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీ లో కూడా సంయుక్త మీనన్ అవకాశాన్ని దక్కించుకుంది. ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున బింబిసార మూవీ విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ సినిమాలో కూడా అవకాశం వచ్చింది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి.

అసలు విషయం లోకి వెళితే ... మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కెరీర్ పరంగా మహేష్ బాబు కి ఈ సినిమా 28 వ సినిమా. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనుండగా , రెండవ హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని మూవీ యూనిట్ తీసుకున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించిన సంయుక్త మీనన్ ఆ వార్తలన్నీ అవాస్తవమని , మహేష్ 28 వ సినిమా కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు అని క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: