బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ ఇంకా కేజీఎఫ్-2 లాంటి సినిమాల విషయంలో వాటి మేకర్స్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు.ఎస్ ఎస్ రాజమౌళి అయితే ఆయా భాషల్లో పేరున్న రచయితలు ఇంకా లిరిసిస్టులను పెట్టుకుని తన వైపు నుంచి ఒక టీంను ఏర్పాటు చేయించి లిరిక్స్ ఇంకా డైలాగ్స్ విషయంలో జాగ్రత్త వహించడం వల్ల, తాను కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల బాహుబలి ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్రాలను అన్ని భాషల వాళ్లూ ఆదరించారు. అలాగే 'పుష్ప' విషయంలో కూడా సుకుమార్ పెట్టిన శ్రద్ధ గురించి కూడా అందరికీ తెలిసిందే.'కేజీఎఫ్-2' మూవీ టీం కూడా ఈ విషయంలో విజయవంతం అయింది. అదొక కన్నడ సినిమా అని తెలుగు, హిందీ ఇంకా తమిళ భాషల వాళ్లు అస్సలు ఫీల్ కాలేదు. ఐతే ఇలా ఇతర భాషల వాళ్లను మెప్పించడంలో, ఒప్పించడంలో తమిళ ఫిలిం మేకర్స్ చాలా ఘోరంగా విఫలమవుతున్నారు. ఒకప్పుడైతే వాళ్లు ఎంత నేటివిటీ దట్టించినా.. డైలాగ్స్ ఇంకా లిరిక్స్ విషయంలో ఏమాత్రం శద్ధ పెట్టకపోయినా చెల్లింది కానీ.. ఇప్పుడు అయితే పరిస్థితులు మారిపోయాయి.


తమిళంలో 'బాహుబలి' సినిమా రేంజ్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్న 'పొన్నియన్ సెల్వన్' సినిమా విషయానికే వస్తే..ఈ సినిమా టైటిల్ దగ్గర్నుంచి ప్రతి విషయంలో కూడా అరవ నేటివిటీ గుప్పుమంటోంది. వేరే భాషలకు తగ్గట్లు పేరు మార్చాలని మణిరత్నం అండ్ కోకు అసలు అనిపించలేదు. ఇప్పుడు ఈ సినిమా నుంచి 'పొంగే నది' అంటూ ఒక పాటను కూడా లాంచ్ చేయగా.. తెలుగు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ చక్కటి తెలుగు పదాలతో పాట రాసినా కూడా రెహమాన్, మరో సింగర్ కలిసి ఆ పదాలను బాగా ఖూనీ చేసేశారు.అసలు వాళ్లేం పాడుతున్నారో అర్థం కాని విధంగా అరవ వాసన గుప్పుమంటోంది పాటలో. రెహమాన్ తెలుగు పదాలను తన నోటికొచ్చినట్లు పలకడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా తెలుగు గాయకులతో పాట పాడించాల్సింది లేదా తాను శ్రద్ధ పెట్టి తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా ఉండేలా అయినా చూసుకోవాల్సింది. అలా కాకుండా తెలుగు పదాలను ఖూనీ చేసేయడాన్ని భాషాభిమానులు చాలా తప్పుబడుతున్నారు. ఈ మాత్రం శ్రద్ధ పెట్టనపుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అసలు ఎలా ఓన్ చేసుకుంటారు? తమిళులు బాహుబలి సినిమాని ఆదరించినట్లు మన వాళ్లు ఈ అరవ సినిమాని ఎలా ఆదరిస్తారు?

మరింత సమాచారం తెలుసుకోండి: