నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ ల సరసన చేరి పోయింది. అలాగే కొంత కాలం క్రితం రష్మిక మందన నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ పాస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ కు దేశ వ్యాప్తంగా అదిరి పోయే రేంజ్ క్రేజ్ వచ్చింది.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన టైగర్ ష్రాఫ్  సరసన కరణ్ జోహార్ నిర్మాణం లో తెరకెక్కబోయే స్క్రూ ఢీలా అనే మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఈ మూవీ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

దానికి ప్రధాన కారణం ... స్క్రూ ఢీలా  మూవీ కి రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చేసేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై టైగర్ ష్రాఫ్ సంతకం చేసినట్లు ,  రెమ్యూనరేషన్ ని తగ్గించుకోవాలని ... ప్రాఫిట్ లో వాటా తీసుకోవాలని టైగర్ ష్రాఫ్ ను కరణ్ జొహార్ కోరినట్లు , దానితో టైగర్ షాప్ పరిశోకాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా ఆగిపోవడంతో రష్మిక మందన కూడా ఈ క్రేజీ సినిమా అవకాశాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే పుష్పా పార్ట్ 2 మూవీ లో రష్మిక మందన నటించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: