తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరోయిన్ లలో ఒకరు అయిన సమంత తాజాగా శాకుంతలం అనే మూవీ లో కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా , దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై నీలిమ గుణ ఈ మూవీ ని నిర్మించింది. ఈ మూవీ లో మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే సమంత కి సంబంధించిన కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లకు ప్రేక్షకులు నుండి మంచి ఆదరణ లభిస్తుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా శాకుంతలం మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నుండి రేపు ఉదయం 10 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ ను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఆ బిగ్ అప్డేట్ దేని గురించి అయి ఉండవచ్చు అనేది తెలియాలి అంటే రేపు ఉదయం 10 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే గుణశేఖర్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం ,  సమంత ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా ,  శేఖర్ వి జోసెఫ్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: