పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం ఇప్పటికే చాలా కాలం అవుతున్న మధ్యలో కొన్ని సార్లు అనువార్య కారణాల వల్ల ఈ మూవీ కొన్ని రోజుల పాటు ఆగిపోవడంతో ఇప్పటికి కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ను మూవీ యూనిట్ ప్రారంభించింది.

మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తేరక్కెక్కిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ తర్వాత తమిళ హిట్ మూవీ వినోదయ సీతం మూవీ ని తెలుగు లో రీమిక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరక్కపోయే భవదీయుడు భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ నటించిన బోతున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది.

ఇలా ఇప్పటికే ఒక మూవీ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో రెండు మూవీ లను లైన్ లో పెట్టి ఫుల్ జోష్ లో పవన్ కళ్యాణ్ తన సినిమా  కెరియర్ ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట మూవీ తో మంచి హిట్ ను అందుకున్న పరుశురామ్ ,  పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ మూవీ ని నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: